ఏపీలోని కూటమి ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డుదారులకు శుభవార్త చెప్పింది. ఏప్రిల్ నుండి కంది పప్పు పంపిణీని పునఃప్రారంభించనున్నట్లు తెలిపింది. కందిపప్పు సరఫరాలో కొరత ఏర్పడిన నేపథ్యంలో పప్పు పంపిణీని నిలిపివేశామని.. మార్కెట్లో కందిపప్పు ధరలు అధికంగా ఉండటంతో ఇప్పుడు తిరిగి కందిపప్పు సరాఫరా చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.