TG: కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ నెల 16న సుప్రీంలో విచారణ జరుగనుంది. ఈ భూములు ప్రభుత్వ భూములేనని రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్లో పేర్కొంది. ఈ భూముల్లోనే యూనివర్సిటీ, మరికొన్ని ఇనిస్టిట్యూట్లు, బస్టాండులు ఇలా ఎన్నో వచ్చాయని సుప్రీంకు తెలిపింది. సుమారు 20 ఏళ్లకు పైగా 400 ఎకరాల స్థలం న్యాయవివాదంలో ఉన్నందున అక్కడ చెట్లు మొలిచి అడవిలాగా తయారైందని వివరించింది.