ఆస్తి పన్నుపై వన్ టైమ్ సెటిల్మెంట్(OTS)కు అవకాశం కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జీహెచ్ఎంసీ తరహాలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఆస్తి పన్నుపై 90 శాతం బకాయి వడ్డీని మాఫీ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. జీహెచ్ఎంసీ పరిధి వరకే ఉన్న ఈ అవకాశాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కల్పించాలని ప్రజల నుంచి రిక్వెస్టులు రావడంతో సర్కారు వారికి ఈ అవకాశం కల్పించింది.