తిరుమల శ్రీవారి సేవలో హర్యానా గవర్నర్

73చూసినవారు
తిరుమల శ్రీవారి సేవలో హర్యానా గవర్నర్
తిరుమల శ్రీవారిని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ దర్శించుకున్నారు. ఆదివారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆయనకు రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్