విద్యుత్ వాహనాల తయారీ సంస్థ గ్రేవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ.. తాజాగా దేశీయ మార్కెట్లో ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. క్లాస్ టెక్నాలజీ అండ్ ఫీచర్స్తో తయారైన ఈ స్కూటర్ ప్రారంభ ధర రూ.1,09,900గా నిర్ణయించింది. 3.22 గంటల్లో పూర్తి స్థాయిలో రీచార్జికానున్న బ్యాటరీతో 136 కి మీ. ప్రయాణించనున్నది. గంటకు 93 కి మీ. వేగంతో దూసుకుపోవచ్చునని కంపెనీ సీఈవో విజయ కుమార్ తెలిపారు.