టీమిండియా మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ 2024 లోక్సభ ఎన్నికల్లో ఎంపీగా ఎన్నికయ్యాడు. పశ్చిమ బెంగాల్లోని బరంపూర్ లోక్సభ నియోజకవర్గం నుంచి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా తొలిసారి బరిలోకి దిగిన యూసఫ్.. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి అధిర్ రంజన్ చౌధురిపై 73 వేల పైగా ఓట్ల తేడాతో గెలుపొందాడు.