ఎంపీగా గెలిచిన ఖలిస్థానీ ఉగ్రవాది

72చూసినవారు
ఎంపీగా గెలిచిన ఖలిస్థానీ ఉగ్రవాది
పంజాబ్‌లోని ఖడూర్‌ సాహిబ్‌ లోక్ సభ నియోజకవర్గంలో ‘వారిస్‌ పంజాబ్‌ దే’ అతివాద సంస్థ అధిపతి, ఖలిస్థానీ మద్దుతుదారుడు అమృత్‌పాల్‌ సింగ్‌ విజయం సాధించారు. కాంగ్రెస్‌ అభ్యర్థి కుల్బీర్‌ సింగ్‌ జీరాపై 1.78లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. జాతీయ భద్రతాచట్టం కింద అరెస్టై అస్సాంలోని దిబ్రూగఢ్‌ జైలులో ఉన్న ఆయన ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. జైలులో ఉండి విజయం సాధించిన నేతగా అమృత్‌పాల్‌ సింగ్‌ రికార్డు నమోదు చేశాడు.

సంబంధిత పోస్ట్