ఐపీఎల్ 2025లో భాగంగా మంగళవారం అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. రాత్రి 7.30కు మ్యాచ్ ఆరంభం కానుంది. అయితే IPLలో ఇప్పటివరకు ఈ ఇరు జట్లు ఐదు సార్లు తలపడగా అందులో గుజరాత్ టైటాన్స్దే పైచేయిగా ఉంది. మొత్తం 5 మ్యాచ్ల్లో గుజరాత్ టైటాన్స్ జట్టు మూడు గెలవగా, పంజాబ్ కింగ్స్ జట్టు రెండిటిలో విజయం సాధించింది.