ఆలయాలు, ప్రార్థనా మందిరాల్లో విక్రయించే ప్రసాదాలకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. లోక్సభలో 2025-26 ఫైనాన్స్ బిల్లుకు సంబంధించి చర్చ చేపట్టారు. ఈ క్రమంలో నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే ఆన్లైన్ ప్రకటనలపై డిజిటల్ పన్నును రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.