రాయ్బరేలి, అమేథిలో తమ విజయానికి కృషి చేసిన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలతో పాటు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియచేస్తున్నానని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. రాయ్బరేలిలో మంగళవారం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అయోధ్యలో BJP ఓటమి పాలైందని.. అయోధ్యే కాదు వారణాసిలో ప్రియాంక గాంధీ పోటీ చేసి ఉంటే ప్రధాని మోదీకి పరాజయం తప్పేదికాదని అన్నారు. ఈసారి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఐక్యంగా NDAపై పోరాడిందని అన్నారు.