విద్యార్థులను యూనిఫాంలో రావాలని కోరడంతో హనుమాన్ భక్తులు ఓ స్కూల్పై దాడి చేసి సామగ్రి ధ్వంసం చేశారు. తెలంగాణలోని మంచిర్యాల జిల్లా కన్నెపల్లిలో ఈ ఘటన జరిగింది. స్థానిక మదర్ థెరిస్సా స్కూల్లో కొందరు
విద్యార్థులు హనుమాన్ మాల ధరించి రావడంతో ప్రిన్సిపల్ అడ్డుకుని, యూనిఫాంలో రావాలని సూచించారు. అయితే ఈ విషయం తెలుసుకున్న హనుమాన్ భక్తులు మూకుమ్మడిగా స్కూల్పై దాడి చేశారు. దాడికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.