పెళ్లి నో చెప్పిందని ప్రేయసిని కొట్టి బావిలో తోసేశాడు!

75చూసినవారు
పెళ్లి నో చెప్పిందని ప్రేయసిని కొట్టి బావిలో తోసేశాడు!
చెన్నైలోని తిరువణ్ణామలై జిల్లాలో దారుణ ఘటన జరిగింది. ప్రియురాలిని బావిలో తోసి ప్రియుడు కడతేర్చాడు. కలసపాక్కంకు చెందిన రోషిణి (21).. అలనార్కమంగళానికి చెందిన శక్తివేల్‌ (29) ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో వారిద్దరూ ఇంటికి వెళ్తుండగా శక్తి పెళ్లి చేసుకుందామని అడగగా.. రోషిణి నిరాకరించింది. దీంతో వారి మధ్య గొడవ జరగడంతో కోపంతో శక్తి.. రోషిణిని బావిలోకి నెట్టడంతో యువతి చనిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్