తెలంగాణలో గత మూడు రోజులుగా వాతావరణం చల్లబడింది. దీంతో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ప్రచార జోరు పెంచారు. అయితే పోలింగ్ రోజు మే 13న పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వికారాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో పోలింగ్ శాతంపై వర్షాల ప్రభావం ఉండనుంది.