బ్రెజిల్ లో వాతావరణం భిన్నంగా ఉన్నది. దక్షిణాది రాష్ట్రం రియో గ్రాండే డుసుల్లో భారీ వర్షాలు కురిశాయి. దీంతో ఆ రాష్ట్రంలో మట్టిచరియలు విరిగిపడ్డాయి. ఆ ఘటన వల్ల 37 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 74 మంది ఆచూకీ లేకుండాపోయారు. ప్రస్తుతం ఆ రాష్ట్రవ్యాప్తంగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇండ్లు, బ్రిడ్జ్లు కూలిన ప్రదేశాల్లో శిథిలాలను తొలగిస్తున్నారు.