దేశంలో రేపు జరిగే తొలి దశ లోక్సభ ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, శాంతియుతంగా నిర్వహించేందుకు కేంద్ర పారామిలటరీ బలగాలను పెద్ద ఎత్తున మోహరించారు. దేశంలో దాదాపు నాలుగు లక్షల మంది కేంద్ర పారామిలటరీ బలగాలను మోహరించారు. ఇప్పటికే 4 వేల కంపెనీలకు చెందిన బలగాలను వేగంగా పోలింగ్ కేంద్రాల వద్దకు భద్రతా ఏర్పాట్లకై పంపారు. మావోల ప్రభావం ఉన్న ప్రాంతాల్లో ఎన్నికలకు ఎటువంటి విఘాతం కలగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.