కన్నడ సినీ హీరో కిచ్చా సుదీప్ రాయచూర్లోని హనుమాన్ ఆలయాన్ని శనివారం సందర్శించారు. తన భార్యతో కలిసి అక్కడ పూజలు చేశారు. నగరంలోని గాంధీ సర్కిల్లోని హనుమాన్ ఆలయాన్ని ఇటీవలే పునః ప్రారంభించారు. గతంలోనూ ఆయన ఈ ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. అయితే అప్పుడు ఒంటరిగా ఇక్కడకు వచ్చారు. మరోసారి తన భార్యతో కలిసి వచ్చి ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.