ఉత్తర భారతంలో వచ్చిన వాతావరణ మార్పులతో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఢిల్లీ, యూపీ, హర్యానాలో వేడి గాలులు వీస్తున్నాయి. రాజధాని ప్రాంతంలో అయితే నార్మల్ కంటే ఏకంగా ఆరు డిగ్రీ సెంటిగ్రెడ్లు ఎక్కువ టెంపరేచర్ నమోదవుతుంది. ఒక్క బిహార్లోనే 24 గంటల్లో 22 మంది చనిపోయారు. రెడ్ అలర్ట్లు జారీ అవుతున్నాయి. అడపాదడపా వర్షాలు కురిసినా ఉక్కపోత, ఎండలు మాత్రం తగ్గడం లేదు.