రాహుల్గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. సోమవారం అసోంలోని ఓ ఆలయంలోకి వెళ్లకుండా అక్కడి అధికారులు రాహుల్గాంధీని అడ్డుకున్నారు. ఆ తర్వాత మోరెగావ్ జిల్లాలో పాదయాత్రకు, స్ట్రీట్ కార్నర్ మీటింగ్కు అనుమతి నిరాకరించారు. అయినా రాహుల్ ఇవాళ మోరెగావ్లో పాదయాత్రకు వెళ్లడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మోరెగావ్ పోలీసులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.