బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన తాజా వెబ్ సిరీస్ హీరామండి: ది డైమండ్ బజార్. ఈ వెబ్ సిరీస్లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితి రావ్, రిచా చద్దా ప్రధాన పాత్రలు పోషించారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో మే 01న స్ట్రీమింగ్కు వచ్చిన ఈ సిరీస్ మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా హీరామండి 2వ సీజన్ను త్వరలోనే ప్రకటించబోతున్నట్లు ఎక్స్ వేదికగా చిత్రబృందం ప్రకటించింది.