విశాఖలో కుండపోత వర్షం కారణంగా ప్రమాదకర స్థితికి చేరిన ఇళ్లు (వీడియో)

63చూసినవారు
విశాఖలో కుండపోత వర్షం కురుస్తోంది. కొండ ప్రాంతాల్లో నివాసముంటున్న ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. నగరంలోని గోపాలపట్నంలో భారీ వర్షాలకు ఇళ్లు ప్రమాదకర స్థితికి చేరుకున్నాయి. కొండవాలు ప్రాంతాల్లో ఉన్న సుమారు 50 ఇళ్లు ప్రమాదపు అంచున ఉన్నాయి. భారీ వర్షాలకు కొండపై ఉన్న ఇళ్ల కింద మట్టి జారిపోతుండటంతో ఇళ్లు కూలిపోయే పరిస్థితికి చేరుకున్నాయి. దీంతో అక్కడి స్థానికులను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు.

సంబంధిత పోస్ట్