భారతదేశంలో ఫోన్ ట్యాపింగ్ అనేది చట్ట విరుద్ధం. అయితే ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడితే మూడేళ్ల జైలు శిక్ష పడుతుందట. ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టంలోని సెక్షన్ 26 (బి) ప్రకారం ఎవరైనా అనధికారికంగా ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడితే మూడేళ్ల జైలు శిక్ష విధిస్తారు. ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడు చాటుగా వినడం అంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం గోప్యత హక్కును ఉల్లంఘించడమేనని న్యాయ నిపుణులు చెబుతున్నారు.