మహాత్మా జ్యోతిరావు పూలే 197వ జయంతి సందర్భంగా గురువారం అంబర్ పేట్ లోని పూలే విగ్రహానికి గోల్నాక కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ది కోసం మహాత్మా జ్యోతిరావు పూలే ఎంతో మేలు చేశారని అమే అన్నారు. అయన ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.