పబ్బులకు, వైన్స్కు అడ్డురాని ట్రాఫిక్ జామ్ 2 గంటలు ఉండిపోయే స్ట్రీట్ వెండర్స్కు అడొస్తుందా? అని మెట్టుగూడ కార్పొరేటర్ రాసూరి సునీత మండిపడ్డారు. స్ట్రీట్ వెండర్స్పై ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకున్న నేపథ్యంలో ఘటనా స్థలాన్ని కార్పొరేటర్ పరిశీలించారు. తమ హాయాంలో మాజీ మంత్రి కేటీఆర్ చొరవతో లోన్స్ ఇప్పించి ఐ డి కార్డ్స్, సర్టిఫికెట్లు ఇచ్చి మరి స్ట్రీట్ వెండర్ను ఆదుకున్నామని గుర్తుచేశారు.