కేబుల్ బ్రిడ్జిపై వాహనం నిలిపితే రూ. 1,000 పైన్

78చూసినవారు
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై వాహనం నిలిపితే రూ. 1, 000 పైన్ వేస్తామని సోమవారం సైబరాబాద్ పోలీసులు ప్రకటించారు. వంతెనపై వాహనం నిలిపి సెల్పీ తీసుకుంటుండగా కారు ఢీ కొట్టడంతో ఓ వ్యక్తి చనిపోయిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇకపై కేబుల్ బ్రిడ్జిపై బర్త్ డే వేడుకలు కూడా చేసుకునేందుకు అనుమతి లేదని తేల్చి చెప్పారు. అయితే ఇనార్బిట్ మాల్ వద్ద వెహికల్స్ నిలిపి పూట్ పాత్ మీదుగా వచ్చి విక్షించవచ్చని తెలిపారు.

సంబంధిత పోస్ట్