ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ మూసారం బాగ్ హై లెవెల్ బ్రిడ్జి పనుల గురించి అధికారులతో కలిసి పర్యవేక్షించారు. ఎనిమిది నెలల క్రితం అప్పటి ఐటీ శాఖ మాజీ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేసినారు. ట్రాఫిక్ డైవర్షన్ వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, అధికారులతో చర్చించి పనులను త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఆదేశించారు.