పాతబస్తీలో అసదుద్దీన్ ఓవైసీ ప్రచారం

62చూసినవారు
డబీర్ పురా డివిజన్ పరిధిలో లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం హైదరాబాద్ ఎంఐఎం ఎంపీ అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ ఎంఐఎం పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరారు. ఎంఐఎం ఆధ్వర్యంలో చేసిన అభివృద్ది కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. ప్రజలకు అనేక మౌలిక వసతులు కల్పించామని తెలిపారు. ప్రచారంలో స్థానిక ఛార్మినార్ ఎమ్మెల్యే మీర్ జూల్ఫీకర్ అలీ, ఎంఐఎం కార్పొరేటర్లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్