కూకట్ పల్లి నియోజకవర్గం 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ డివిజన్ పరిధిలోని శంశిగుడా లోని ఆదర్శ్ నగర్ కాలనీ పెద్ద మనుషులతో ఆదివారం సమావేశమై కాలనీ సమస్యల గురించి చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా కాలనీ వాసులు ఆదర్శ్ నగర్ కాలనీలో డ్రైనేజీ లైన్స్ మరియు త్రాగు నీరు సమస్యలను కార్పొరేటర్ దృష్టికి తీసుకువచ్చారు. కార్పొరేటర్ మాట్లాడుతూ కాలనీలో నివాసాలు పెరిగి డ్రైనేజీ లైన్ చిన్నగా ఉన్నాయని అన్నారు.