కాంగ్రెస్ ప్రభుత్వం పై జోగినిలు, శివశక్తుల ఆగ్రహం

50చూసినవారు
బల్కంపేట్ ఎల్లమ్మ కళ్యాణం రోజు జోగినిలు, శివ శక్తులకు జరిగిన అవమనంపై తెలంగాణ శివ శక్తుల సంక్షేమ సంఘం అధ్యక్షురాలు జోగిని శ్యామల ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో వారు మాట్లాడుతూ.. ఏర్పాట్ల విషయమై కాంగ్రెస్ ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేశారు. కళ్యాణం రోజు పోలీసులు ప్రవర్తించిన తీరుపై మండిపడ్డారు. ఈసారి బోనాల ఉత్సవాలను తమ ఇళ్లలోనే నిర్వహించేందుకు నిర్ణయించామని ప్రకటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్