బాలనగర్ డివిజన్ రాజీవ్ గాంధీ నగర్లో వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో
క్రికెట్ పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాల్గొని టోర్నమెంట్ ను శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి సంవత్సరం రాజీవ్ గాంధీ నగర్ లో
క్రికెట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని కులాలకు మతాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా ఉండాలని కోరారు.