రంగారెడ్డి జిల్లా శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విషాదం చోటుచేసుకుంది. అస్వస్థతతో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు. గురువారం మధ్యాహ్నం గోవా నుంచి వచ్చిన నితిన్ షా అనే వ్యక్తి, జెడ్డా నుంచి వచ్చిన షేక్ సకీనా అనే మహిళ ఎయిర్పోర్టులోకి ఎంటర్ అవగానే కుప్పకూలారు. గమనించిన ఎయిర్పోర్ట్ సిబ్బంది హుటాహుటిన వారిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.