చేపలు పట్టేందుకు చెరువుకి వెళ్ళిన ఇద్దరు యువకులు నీటిలో మునిగి మృతి చెందిన సంఘటన పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు. బార్కాస్ కు చెందిన అబ్దుల్ వాహెద్(14), ఉస్మాన్ నహదీ(16)లు తమ ముగ్గురు స్నేహితులతో కలిసి జల్ పల్లి చెరువులో ఆదివారం చేపలు పట్టేందుకు వచ్చారు. ప్రమాదావశాత్తు నీట మునిగిన ఇద్దరు మృతదేహాలను పోలీసులు సోమవారం వెలికితీశారు.