క్రషర్ క్వారీలో మరో యువకుడు బలి

50చూసినవారు
కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం నెలకొంది. నెలరోజుల వ్యవధిలోనే మరో యువకుడు క్రషర్ క్వారీలో పడి గౌతమ్ 21 సం"లు మృతి చెందాడు. ఓ కంపెనీలో సేల్స్ మ్యాన్ గా పని చేస్తున్న గౌతమ్ అంకిరెడ్డిపల్లి గ్రామంలోని మహాలక్ష్మి క్రషర్ క్వారీలో ఈతకని వచ్చాడు. సరదా కాస్త ప్రాణం తీసింది. గౌతమ్ స్వస్థలం సైనిక్ పురి ప్రాంతానికి చెందిన వాడు గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్