1లక్ష సబ్సిడీ వద్దు రజక బంధు ఇవ్వండి...ముఖ్యమంత్రి కి లేఖ

1346చూసినవారు
1లక్ష సబ్సిడీ వద్దు రజక బంధు ఇవ్వండి...ముఖ్యమంత్రి కి లేఖ
తెలంగాణ రాష్ట్రంలో కులవృత్తి చేస్తున్న రజకులకు ప్రభుత్వం సబ్సిడీకింద 1లక్ష రూపాయలు ఇస్తామని ప్రకటించింది. కానీ దానికోసం కొన్ని షరతులు ఇచ్చింది. ఇలాంటి 1లక్ష రూపాయల సబ్సిడీ మాకు వద్దని రజక బంధు కింద 10లక్షలు ప్రతి రజక కుటుంబానికి అందజేయాలని ముఖ్యమంత్రి కేసిఆర్ కు అఖిల భారత రజక సంఘం జాతీయ అధ్యక్షులు మొగ్గ అనీల్ కుమార్ రజక మంగళవారం లేఖ రాశారు. గతంలో కూడా 250 కోట్లు కేటాయిస్తామని మోసం చేశారని మరోసారి రజకులను మోసం చేయవద్దని అన్నారు. లక్ష రూపాయలు ఇచ్చి రజకులను బిక్షగాలుగా చూడొద్దని ఆవేదన వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్