నేడు రాష్ట్ర వ్యాప్తంగా రజకులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలపాలి: మొగ్గ

562చూసినవారు
నేడు రాష్ట్ర వ్యాప్తంగా రజకులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలపాలి: మొగ్గ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2018లో రజక భవనం కోసం ఉప్పల్ మేడిపల్లి దగ్గర రెండున్నర ఎకరాల స్థలాన్ని కేటాయించింది. గతంలో భవన నిర్మాణానికి డబ్బుకూడా ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఆ స్థలాన్ని కొందరు కబ్జా చేసి అమ్ముకుంటున్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించాలని అఖిల భారత రజక సంఘం జాతీయ అధ్యక్షులు మొగ్గ అనీల్ కుమార్ రజక డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రజకులను మరోసారి మోసం చేసిందని, దీనిని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రజకులు శుక్రవారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలపాలని ఆయన పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్