సికింద్రాబాద్ కంటోన్మెంట్ - Secunderabad Cantt

గులాబీమయమైన సికింద్రాబాద్ కంటోన్మెంట్

గులాబీమయమైన సికింద్రాబాద్ కంటోన్మెంట్

పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో బాలంరాయి అన్నానగర్ రోడ్ షో లో కెటిఆర్ తో కలిసి మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అభ్యర్థి నివేదిత సాయన్న, మల్కాజిగిరి శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఇంఛార్జి రావుల శ్రీధర్ రెడ్డి తదితర ముఖ్య నాయకులు పాల్గొనడం జరిగింది. నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేశారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ, అహకారంతో విర్రవీగుతున్న కాంగ్రెస్ కి బుద్ధి చెప్పాలంటే బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని పార్లమెంటుకు పంపాలని అన్నారు. అమరవీరుల స్తూపం వద్ద ఒక పువ్వు పెట్టని రేవంత్ ఇప్పుడు తెలంగాణ గురించి మాట్లాడుతున్నాడని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు మహిళలు,అభిమానులు, తదితరులు వేల సంఖ్యలో పాల్గొన్నారు.

వీడియోలు


హైదరాబాద్