బుల్లెట్ బండిపై పద్మారావు ఎన్నికల ప్రచారం
సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి రోజు సనత్ నగర్ లో నిర్వహించిన భారీ బైకు ర్యాలీలో సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ కార్యకర్త బుల్లెట్ బండిపై మాజీమంత్రి స్థానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ అభివృద్ది చేసే లక్ష్యంగా ముందుకు సాగుతున్నానని తనకు అవకాశం కల్పించి కేసీఆర్ కు బహుమానంగా అందించాలని ఆకాంక్షించారు.