ట్యాంక్ బండ్ పై ధూంధాంగా కళాజాత ప్రారంభం

77చూసినవారు
తెలంగాణ ప్రజానాట్య మండలి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 2 రోజుల పాటు జరిగే కళాజాతను శనివారం ట్యాంక్ బండ్ పై మగ్ధూం మొహియుద్దీన్ విగ్రహం వద్ద సీపీఐ నారాయణ ధూంధాంగా డప్పు వాయిస్తూ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్య దర్శి వర్గ సభ్యుడు వీఎస్ బోస్, సీపీఐ జిల్లా కార్య దర్శి ఛాయాదేవి, ప్రజానాట్య మండలి రాష్ట్ర కే. శ్రీనివాస్, పల్లె నరసింహ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్