సికింద్రబాద్ గురుద్వారా సాహిబ్ ను ఆదివారం బీఆర్ఎస్ నేతలు దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మల్కాజ్ గిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత హాజరయ్యారు. బీఆర్ఎస్ అన్ని మతాల వారికి సమాన అవకాశాలు ఇచ్చినట్లు రాగిడి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ఎన్నికలలో బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.