ఎంపీ ఎన్నికల్లో సికింద్రబాద్ హాట్ ఫేవరెట్ గా మారింది. కిషన్ రెడ్డి, పద్మరావు, దానం నాగేందర్ పోటీలో ఉండడం అంచనాలు పెంచింది. నియోజకవర్గం ఆవిర్భావం నుంచి ఇక్కడ జాతీయ పార్టీలదే హవా. ఒకే ఒక్కసారి తెలంగాణ ప్రజా సమితి (1971) గెలిచింది. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కూడా బీఆర్ఎస్ ఖాతా తెరవలేదు. ఈ సారి పజ్జన్న నిలబడడంతో టాగ్ ఆఫ్ వార్ ఆని టాక్. బీజేపీ, కాంగ్రెస్ కూడా గెలుపుపై ధీమాగా ఉన్నారు. మరి ఈసారి గెలుపెవరిదో.