నాచారం పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం

85చూసినవారు
నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఇండస్ట్రియల్ పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. రామ్సన్ పెయింటింగ్ గోదాంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సుమారు గంట నుంచి మంటలు ఎగసిపడుతున్నాయి. 4 అగ్నిమాపక ఫైర్ ఇంజన్ లతో మంటలు ఆర్పే యత్నం చేస్తున్నారు. ఇంకా మంటలు అదుపు కాలేదు. గోదాం పక్కనే ఉన్న తిరుమల వుడ్స్ కాలనీ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. అగ్ని ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్