రాహుల్గాంధీవి పచ్చి అబద్ధాలు
రాహుల్గాంధీ నిర్మల్ సభలో పచ్చి అబద్ధాలు చెప్పారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రాహుల్గాంధీ అమాయకుడు అని, ఇక్కడి కాంగ్రెస్ నేతలు రాసిచ్చింది చదివారని పేర్కొన్నారు. మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి మద్దతుగా ఆదివారం ఉప్పల్ లో రోడ్షో నిర్వహించారు.