పత్తర్ గట్టి డివిజన్ పరిది మౌలా కా చిల్లా ప్రాంతం నుండి రంగెలి కిడ్కి ప్రాంతం వరకు డ్రైనేజీ సమస్యలు ఉన్నాయి. రోడ్డుపై మురుగు నీరు నిలిచి దుర్వాసన వస్తోందని స్థానిక వ్యాపారస్తులు, వాహనదారులు వాపోయారు. స్థానిక సిబ్బందికి ఎన్నిసార్లు పిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని, గత 15 రోజులుగా సమస్య ఇలాగే ఉందని స్థానికులు శుక్రవారం వాపోయారు. వెంటనే అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.