అమీన్ పూర్ చెరువులో మహిళ మృతదేహం

78చూసినవారు
అమీన్ పూర్ మున్సిపల్ పరిధి పెద్ద చెరువులో జారిపడిన జయశ్రీ (25) మృతదేహం లభ్యమైంది. శుక్రవారం సాయిరాంకాలనీకి చెందిన రవితేజ, జయశ్రీ దంపతులు కూతురితో కలిసి పెద్దచెరువు సందర్శనకు వెళ్లారు. ఈ క్రమంలో చెరువుగట్టు మీద నుంచి జారి జయశ్రీ చెరువులో గల్లంతైంది. సమాచారం అందుకున్న గజ ఈతగాళ్లు, డిఅర్ఎఫ్ సిబ్బంది గాలింపు చేపట్టారు. గంటల వ్యవధిలో మృతదేహాన్ని బయటకు తీశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్