'అక్రమ' నిర్మాణాలు తొలగించాలని జయభేరి సంస్థకు నోటీసులు జారీ చేసిన హైడ్రా

72చూసినవారు
'అక్రమ' నిర్మాణాలు తొలగించాలని జయభేరి సంస్థకు నోటీసులు జారీ చేసిన హైడ్రా
ప్రముఖ సినీ నటుడు మురళీమోహన్ కు చెందిన జయభేరి సంస్థకు హైడ్రా నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్ గచ్చిబౌలిలోని రంగలాల్ కుంట చెరువు ఎఫ్‌టీల్‌, బఫర్ జోన్ లలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను తొలగించాలనేది ఈ నోటీసుల సారాంశం. 15 రోజుల్లోగా నిర్మాణాలు తొలగించకపోతే, కూల్చేస్తామని నోటీసుల్లో పేర్కొంది. మరోవైపు, దుండిగల్ లో కత్వా చెరువులోని 8 విల్లాలు, మాదాపూర్ లో ఉన్న సున్నం చెరువులోని ఆక్రమణలను ఆదివారం హైడ్రా కూల్చేసింది.

సంబంధిత పోస్ట్