మహిళా రెజ్లర్లపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలను బీజేపీ ఎంపీ, డబ్ల్యూఎఫ్ఐ మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ తోసిపుచ్చారు. తాను నిర్దోషి అని నిరూపించుకోవడానికి తన వద్ద ఆధారాలు ఉన్నాయని అన్నారు. ఈ కేసులో ఆయనపై ఇప్పటికే చార్జిషీటు దాఖలైంది. కాగా, విచారణకు సిద్ధమని స్పష్టం చేశారు. అతడిని దోషిగా నిలబెట్టాల్సిన బాధ్యత ఢిల్లీ పోలీసులపై ఉందన్నారు. ఆరోపణలతో తనకు ఎంపీ టికెట్ దక్కక పోయినా.. తన కుమారుడికి అవకాశం దక్కిందన్నారు.