వివేకా హత్య కేసు నిందితుడు సునీల్ యాదవ్ కడపలో ప్రెస్ మీట్లో మాట్లాడారు. వైకాపా మాజీ ఎమ్మెల్యే రాచమల్లు తనపై అనేక ఆరోపణలు చేశారని సునీల్ వాపోయారు. "రూ.500 అప్పు చేసిన నేను కోట్లు సంపాదించానని ఆరోపణలు చేస్తున్నారు. వాటిని నిరూపించాలి. ఈ ప్రభుత్వం వచ్చాక రాచమల్లు ఎవరి కాళ్లు పట్టుకున్నారో చెప్పాలి. నాకేమైనా జరిగితే వైకాపా నేతలు, వివేకా కేసు నిందితులదే బాధ్యత" అని సునీల్ చెప్పారు.