మోహన్లాల్ ప్రధాన పాత్రలో నటించిన 'ఎల్2 : ఎంపురాన్' సినిమాలోని కొన్ని సన్నివేశాల విషయంలో వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వివాదానికి దారి తీసిన సన్నివేశాలను తొలగించమని డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్కు తెలిపినట్లు చిత్ర నిర్మాత గోకులం గోపాలన్ వెల్లడించారు. తమకు ఏ రాజకీయ పార్టీతో సంబంధాల్లేవని ఆయన తెలిపారు. ఇప్పటికే కొన్ని పదాలను మ్యూట్ చేశామని నిర్మాత పేర్కొన్నారు.