ఈ ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ సాధించడంపై మార్కెట్ల జోరు ఆధారపడి ఉందని ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కంపెనీ యూబీఎస్ వెల్లడించింది. బీజేపీకి బంపర్ మెజార్టీ వస్తే మార్కెట్ల జోరు కొనసాగుతుందని, బీజేపీకి సీట్లు తగ్గితే మార్కెట్ నెమ్మదిస్తుందని అంచనా వేసింది. ఒకవేళ ఇండియా కూటమి అధికారంలోకి వచ్చి ఎన్డీఏ అమలు చేసిన విధానాల్లో మార్పులు చేస్తే స్టాక్స్ 2014కు ముందున్న విలువలకు పడిపోయే అవకాశం ఉందని పేర్కొంది.