‘బావగారు బాగున్నారా’ చిత్రంలో ఓ సన్నివేశం కోసం 240 అడుగుల ఎత్తునుంచి దూకారు. ఏక, ద్వి, త్రిపాత్రాభినయం చేసిన సినిమాలు 100 రోజులు ప్రదర్శితమైన రికార్డు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చిరంజీవికే దక్కింది. రూ.కోటికిపైగా పారితోషికం అందుకున్న తొలి భారతీయ నటుడిగా 1992లో వార్తల్లో నిలిచారు. ఘరానా మొగుడు.. రూ.10 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించిన తొలి తెలుగు చిత్రంగా, ‘ఇంద్ర’..రూ. 30 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లు చేసిన తొలి తెలుగు చిత్రంగా చరిత్ర సృష్టించాయి.