భారతదేశంలో సమాధులను ఎంతో పవిత్రంగా భావిస్తారు. వాటికి పూజలు పువ్వులు చల్లి మొక్కుతారు. కానీ పంజాబ్లోని ముక్సార్ సాహిబ్ సమీపంలో విచిత్రమైన ఆచారం ఉంది. గురు గోవింద్ సింగ్ను మోసం చేసిన మొఘల్ గుఢచారి నూర్ధిన్ సమాధిని అక్కడి గ్రామస్థులు చెప్పులతో కొడుతున్నారు. అయితే ఇది అక్కడి ఆచారమని, అలా చేస్తే జీవితంలో చెడు తొలగిపోతుందని ప్రజలు నమ్ముతున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైలర్ అవుతోంది.